ప్రభుత్వ ఉద్యోగులు(Employees), పింఛనుదారుల(Pensioners)కు ప్రభుత్వం శుభవార్త అందించింది. మెడికల్ రీయంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లులన్నీ ఒకేసారి క్లియర్ చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు, లెక్కకు మించి సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా మెడికల్ బిల్లుల్ని క్లియర్ చేస్తున్నట్లు డిప్యూటీ CM గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాం 2023 మార్చి 4 నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులకు నిధులందుతాయి. ఈ నిర్ణయం ద్వారా 26,519 ఉద్యోగులకు మేలు కలగనుంది. https://justpostnews.com