ఉద్యోగుల(Employees)కు ఊరట కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న ఐదింటికి గాను రెండు DAలు కేటాయించింది. ఒక DA ప్రస్తుతం చెల్లించనుండగా, మరో DAను ఆరు నెలల్లో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్(Trust) ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఈ ట్రస్టు ద్వారానే నిధులు అందించబోతుండగా, ఇందులో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ.700 కోట్లకు తగ్గకుండా క్లియర్ చేయాలని నిర్ణయించారు. https://justpostnews.com