పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 42,832 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 38,741 మంది పరీక్షలు రాశారు. 73.35 శాతంతో 24,415 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 30 టెన్త్ ఫలితాలు విడుదల కాగా.. 92.78% మంది పాసయ్యారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారి కోసం జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు.