ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏకరూప దుస్తుల(Uniforms)ను బడుల పునఃప్రారంభం రోజునే అందివ్వాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. యూనిఫామ్స్ విషయంలో అలసత్వం ఉండొద్దన్నారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని, ప్రైవేటు ప్లే స్కూళ్లకు దీటుగా అవి ఉండాలని స్పష్టం చేశారు. త్వరలోనే బాలభరోసా పథకం అమలు చేస్తామన్న సీతక్క.. ఐదేళ్ల లోపు పిల్లలకు అవసరమైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.