పశ్చిమాసియాలో మరో యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఏకపక్షంగా విరుచుకుపడితే అందుకు జవాబుగా ఇరాన్ రెచ్చిపోయింది. వందల డ్రోన్లను ఇజ్రాయెల్(Israel)పైకి ప్రయోగించగా, వాటన్నింటినీ ఐరన్ డోమ్ ల ద్వారా అడ్డుకుంటోంది. అణుస్థావరాలే లక్ష్యంగా నెతన్యాహు సర్కారు చేస్తున్న దాడులతో టెహ్రాన్ మిలిటరీ చీఫ్ లు, సైంటిస్టులు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఇరాన్ సైతం డ్రోన్లు, మిసైళ్లతో రెచ్చిపోవడంతో ఇరుదేశాల మధ్య యుద్ధం ముదిరింది. అయితే ఈ విషయంలో తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది.