ఇజ్రాయెల్(Israel) అణు దాడికి దిగితే ఆ దేశంపై పాకిస్థాన్ అణుబాంబు వేస్తుందంటూ ఇరాన్(Iran) జనరల్ మొహిసిన్ రెజాయ్ ప్రకటించారు. నిజంగా ఇజ్రాయెల్ పై దాడి జరిపేంత ధైర్యం పాక్ కు ఉందా.. అమెరికాను కాదని ఒక్క అడుగైనా వేస్తుందా.. అది జరగనే జరగదు. దేశం అల్లకల్లోలమై విదేశీ నిధులతో పూట గడుపుతున్న పాక్.. అణుబాంబు వేస్తుందన్నది ఉత్తి మాటేనని నిపుణులంటున్నారు. మొన్న భారత్ దాడిలో పాక్ న్యూక్లియర్ రియాక్టర్లు దెబ్బతిన్నట్లు ప్రచారం జరిగింది. వాటినే కాపాడుకోలేని షహబాజ్ సర్కారు.. అత్యంత పటిష్ఠంగా, అమెరికా అండదండలున్న ఇజ్రాయెల్ పై దాడికి దిగడం పెద్ద జోక్ అట. అన్నట్లుగానే పాక్ సైతం ఇరాన్ మాటల్ని తిప్పికొట్టింది. తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది.