భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్ కు మోదీ వివరించారు. అమెరికా అధ్యక్షుడితో 35 నిమిషాలు మాట్లాడిన ప్రధాని.. భారత్-పాక్ విషయంలో మధ్యవర్తిత్వం(Mediation) అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు దీనిపై ఎవరి జోక్యం లేదని, భవిష్యత్తులోనూ ఆ అవసరం రావొద్దని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి సరికాదని, అందరూ పోరాటం చేయాల్సిందేనని ప్రధాని చెప్పినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misry) తెలిపారు.