ఏడో రోజూ ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం భీకరంగా సాగుతోంది. రెచ్చిపోయిన ఇరాన్(Iran) దక్షిణ ఇజ్రాయెల్ లోని సరోకా(Saroka) మెడికల్ సెంటర్(ఆస్పత్రి)పై బాలిస్టిక్ మిసైల్ తో దాడి చేసింది. వెయ్యి పడకల ఆస్పత్రిలో 47 మంది గాయపడ్డారు. బీర్షెబాలోని ఈ హాస్పిటల్ దక్షిణ ఇజ్రాయెల్ లోనే అతి పెద్దది కాగా, 10 లక్షల మందికి సేవలందిస్తోంది. ఈ దాడితో దేశంలోని హాస్పిటల్స్ లో గల బంకర్లలోకి రోగులను తరలించి వైద్యమందిస్తున్నారు. దీనిపై ప్రతీకారం తప్పదని అందుకు రెడీగా ఉండాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.