అమెరికా ఎంట్రీతో ఇరాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు అణుకేంద్రాలు(Nuclear Plants) ఫార్దో, నటాంజ్, ఇస్ఫహాన్ పై B-2 స్టెల్త్ బాంబర్లతో విరుచుకుపడింది. 30 వేల పౌండ్ల బరువు గల బాంబులతో కూడిన 6 బంకర్లు ఫార్దో(Fordow)లో ఉన్నాయి. 15 రోజులుగా సందిగ్ధంలో ఉన్న ట్రంప్.. ఇరాన్ పై దాడికి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 13న ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధంతో ఇరాన్ కమాండర్లు, కీలక నేతలు, శాస్త్రవేత్తలు సహా మొత్తంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. జవాబుగా ఇరాన్ 450 మిసైళ్లు, వెయ్యి డ్రోన్లు ప్రయోగించగా, ఇజ్రాయెల్ లో 24 మంది మృతిచెందారు.