చిన్నప్పుడు బడి బయట తాము గోలీసోడా తాగిన బండ్లే ప్రస్తుతం డ్రగ్స్ అమ్మే స్థాయికి వచ్చాయని సినీ నటుడు రాంచరణ్ తేజ్ అన్నారు. పిల్లలకు ఐస్ క్రీముల్లో ఏమిస్తున్నారో అర్థం కావడం లేదని.. మత్తుపదార్థాల(Drugs)కు దూరంగా ఉండాలని పిల్లలు, యువతను కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శారీరక ఉత్సాహానికి గేమ్ లు ఆడాలే తప్ప మత్తు పదార్థాలు వాడటం కాదని గుర్తు చేశారు. ఒక తండ్రిగా పిల్లల్ని పాఠశాలలకు పంపించాలన్నా ఆందోళన చెందాల్సి వస్తోందన్నారు.