రైలు పట్టాలపై 7 కిలోమీటర్లు కారు నడిపిన యువతిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 26న ఆమె రంగారెడ్డి జిల్లాలోని ట్రాక్ పై కారు నడపగా.. అదేరోజు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పోలీసులు, రైల్వే శాఖ కేసులు నమోదు చేయగా, కారును ఆపినప్పుడు స్థానికులపై రాళ్లతో దాడి చేసింది. తొలుత మద్యం తాగిందని భావించగా.. ఆమె పరిస్థితి ఏంటో తేలలేదు. కానీ వైద్యుల పరిశీలన పూర్తయిన తర్వాత ఎర్రగడ్డలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నార్సింగిలో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారామె.