
హైదరాబాద్ లోని మియాపూర్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మదీనాగూడ సందర్శిని హోటల్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. హోటల్ జనరల్ మేనేజర్(GM) దేవేందర్ పై కాల్పులు జరపడంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. సదరు జనరల్ మేనేజర్ ను హుటాహుటిన హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 6 బుల్లెట్లను స్వాధీనం(Recovery) చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తీవ్రగాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దేవేందర్ ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన తీరుపై CC ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు(Investigation) చేస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి హోటల్ మూసివేసేవరకు అక్కడ ఎప్పుడూ రద్దీ ఉంటుంది. మరోవైపు మియాపూర్-చందానగర్ మెయిన్ రోడ్డుపైనే సందర్శిని హోటల్ ఉంటుంది. ఎప్పుడూ జనంతో కనిపించే హోటల్ లో కాల్పులు జరగడం సంచలనానికి కారణమైంది.