అవతలి వైపు నుంచి ‘ప్రియా’ అంటూ మెసేజ్.. మహిళ అనుకుని మాయలో పడ్డ అధికారి.. రహస్యాల చేరవేతకు రూ.2 లక్షలతో ఒప్పందం.. రూ.50 వేలు కేవలం ఆపరేషన్ సిందూర్ లీక్ కోసమే. ఇదీ దేశ నావికా(Navy) రహస్యాల్ని పాక్ కు చేరవేసిన విశాల్ యాదవ్ అనే ఉద్యోగి వ్యవహారం. ఢిల్లీలోని డాక్ యార్డ్ నేవీ భవనంలో పనిచేస్తున్న హరియాణా రెవారి(Rewari) వాసి విశాల్.. ఛాటింగ్ చేస్తున్న వ్యక్తి భారతీయురాలు అనుకున్నాడు. ప్రియా శర్మగా ఫేస్ బుక్ ద్వారా పాకిస్థానీ లైన్లోకి వచ్చాడు. అది కాస్తా వాట్సాప్ ఛాటింగ్ కు చేరి రూ.5-6 వేల దాకా తీసుకున్నాడు. మొబైల్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి. ఆన్లైన్ గేమింగ్ కు ఆ ఉద్యోగి బానిసైనట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.