నేరస్థుల్ని గడగడలాడిస్తున్న యోగి సర్కారు.. ఎన్ కౌంటర్లతో దడపుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో BJP సర్కారు అధికారంలోకి వచ్చాక 14,741 ఎన్ కౌంటర్లు జరిగినట్లు అక్కడి యాక్టింగ్ DGP రాజీవ్ కృష్ణ ప్రకటించారు. 2017 నుంచి 2024 వరకు 234 మంది హతమైతే, 9,202 మంది గాయపడ్డారు. 30.293 మంది క్రిమినల్స్ అరెస్టయ్యారు. 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా మరో 1,700 గాయాల పాలయ్యారు. మీరఠ్ జోన్ లో అత్యధికంగా 4,183 ఎన్ కౌంటర్లు జరిగితే 77 మంది నేరస్థులు హతమయ్యారు. ఆగ్రా జోన్ లో 2,288, వారణాసి జోన్ లో 1,041 ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.