నిశ్చితార్థం(Engagement) నుంచే హత్యకు కుట్ర పన్నింది. తాళి కట్టిన నెలకే భర్తను చంపించిన ఆమె.. అతని కదలికల కోసం బైక్ కు GPS పెట్టించింది. గద్వాల జిల్లాలోని ఘాతుకమిది. కర్నూలుకు చెందిన తిరుమలరావు బ్యాంకు మేనేజర్. అందులో పనిచేసే స్వీపర్ సుజాతను ఆర్థికంగా ఆదుకుని లోబర్చుకున్నాడు. ఆమె కూతురు ఐశ్వర్యతోనూ అక్రమ సంబంధం నడిపాడు. కానీ ఆమెకు గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ తో ఎంగేజ్మెంట్ అయింది. తిరుమలరావు-ఐశ్వర్య బంధం కష్టమవడంతో అతణ్ని చంపాలనుకున్నారు. మే 18న తేజేశ్వర్-ఐశ్వర్య పెళ్లయింది. అప్పటికే ప్లాన్ తో ఉన్న మేనేజర్.. లోన్ కోసం వచ్చిన నగేశ్ ను ఉసిగొల్పాడు. హత్య చేస్తే పెద్ద లోన్లు ఇస్తానన్నాడు. పొలాలు కొంటామంటూ తేజేశ్వర్ తో నగేశ్, పరశురాముడు, రాజు పరిచయం పెంచుకున్నారు. ఈనెల 17న గద్వాలలో అతణ్ని కారు ఎక్కించుకుని ఎర్రవల్లి సమీపంలో హత్య చేసినట్లు SP శ్రీనివాసరావు తెలిపారు. ఈ కథలో ఇంకా ట్విస్టులున్నాయి. ఈ వార్త పూర్తిగా… లింక్ క్లిక్ చేసి చదవండి…https://justpostnews.com/crime/traingle-love-story-in-gadwal-murder-case/