యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బండారమంతా బయటపడింది. ఆమె 3 ఫోన్లలోని చాట్ రికార్డులు, కాల్ లాగ్స్, వీడియో ఫుటేజీల 12 TB డేటాను పోలీసులు పరిశీలించారు. నలుగురు ISI ఆఫీసర్లతో సంబంధాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు తేలింది. పాక్ టూర్లలో జ్యోతి(33)కి VVIP కేటగిరీ మర్యాద దక్కింది. అత్తగారింటికి వెళ్లొచ్చినట్లు సులువుగా పాక్ చుట్టివచ్చేది. ISI అధికారి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ తో తరచూ మాట్లాడినట్లు విచారణలో ఒప్పుకుంది. ఆ నలుగురు ISI ఏజంట్లని జ్యోతికి ముందే తెలుసు. ఆమెతో సంభాషించిన హరియాణా సిక్కు గురుద్వారా IT ఇంఛార్జి హర్ కీరత్ సింగ్ 2 ఫోన్లనూ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. భారత సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు కలిగించిందంటూ అభియోగాలు మోపారు. పాక్ పై దాడుల తర్వాత వారానికి.. మే 15న జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసి జైలుకు పంపారు.