
వచ్చే సంవత్సరం జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకలకు అటెండ్ కానున్నారు. జీ20 సమావేశాల సందర్భంగా భేటీ అయిన సందర్భంలో గణతంత్ర వేడుకలకు రావాలని బైడెన్ ను మోదీ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం జరిగే వేడుకలకు ఒకర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించే సంప్రదాయంలో భాగంగా జో బైడెన్ మన దేశానికి రాబోతున్నారు.