జైలుకు వెళ్తారా అంటూ సీనియర్ IAS అర్వింద్ కుమార్ ను హైకోర్టు హెచ్చరించింది. హైదరాబాద్ ఉప్పల్ HMDA లేఅవుట్ లోని ప్లాట్ల కేటాయింపుపై ఆగ్రహించింది. భూ నిర్వాసితుడికి ప్లాట్ కేటాయించకపోవడంపై HMDA మీద మండిపడింది. అర్వింద్ సహా మరో అధికారి ప్రసూనాంబను జైలుకు పంపాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. అప్పట్లో HMDA కమిషనర్ గా పనిచేశారాయన. మూడు వారాల్లోగా తమ ఆదేశాల్ని అమలు చేయకపోతే కఠిన చర్యలకు తప్పవని స్పష్టం చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులోనూ అర్వింద్ A1గా ఉన్నారు. ED విచారణ, పలు పార్టీల ఆరోపణలతో గందరగోళంలో ఉన్న ఈ సీనియర్ IAS.. నెల రోజుల సెలవుపై యూరప్ వెళ్లారు.