అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ‘యూ’ టర్న్ తీసుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ను ఆపింది తానేనని ఇన్నాళ్లూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు మాట మార్చారు. భారత్-పాక్ యుద్ధం ఆగడంలో తన ప్రమేయం(Involvement) లేదని అంగీకరించారు. ఆ రెండు దేశాలే ఉద్రిక్తతల్ని తగ్గించుకున్నాయన్నారు. ట్రంప్ తో నిన్న ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. యుద్ధాన్ని ఆపానంటూ చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండించారు. మోదీ మాట్లాడిన తర్వాత కూడా ట్రంప్ మాటతీరు మారలేదు. కానీ ఉన్నట్టుండి ఈ రోజు ఆయన యూ టర్న్ తీసుకుని, అందులో తన ప్రమేయం లేదన్నారు. దీంతో ట్రంప్ చెప్పింది అబద్ధమని, భారత్ వాస్తవమే మాట్లాడిందని ప్రపంచానికి అర్థమైంది. https://justpostnews.com