భారతీయ జనతా పార్టీ(BJP) రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. జులై 1న జరిగే ఎన్నికకు రేపు(జూన్ 29న) నోటిఫికేషన్ వస్తుంది. ఎల్లుండి(జూన్ 30న) నామినేషన్లు ఉంటాయి. 3 నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు పూర్తి చేయాలని హైకోర్టు తీర్పివ్వగా.. మున్సిపల్ ఎన్నికలపై సైతం సర్కారుకు నోటీసులిచ్చింది. ఇలా స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అనివార్యమైంది. తెలంగాణ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరంద్లాజే, AP అధికారిగా పి.సి.మోహన్ ను హైకమాండ్ నియమించింది. https://justpostnews.com
పోటీలో ఎవరంటే…
ఈటల రాజేందర్, డి.కె.అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో లుకలుకలు, అసంతృప్తుల నడుమ.. ఏడాది కాలంగా అధ్యక్ష ఎన్నిక పెండింగ్ లో ఉంది. MPకి ఇవ్వాలనుకుంటే ఈటల, అరుణ, రఘునందన్, అర్వింద్.. మహిళల కోటాలో అరుణ.. మరో నిర్ణయమైతే వెంకటరమణారెడ్డికి ఛాన్స్ ఉంటుంది. వీరందర్నీ కాదని కొత్తవారికి అవకాశమివ్వాలని భావిస్తే మాత్రం సంచలన ఎన్నిక అవుతుంది. ఇక పార్టీకి పునరుజ్జీవం తేవాలని భావించి బండి సంజయ్ వైపు మొగ్గే అవకాశాలను కొట్టిపారేయలేమన్న చర్చ జోరందుకుంది. https://justpostnews.com