తిరుమల శ్రీవారి(Venkateswara Swamy) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో వేలాదిగా తరలివచ్చారు. కొండపైకి ఎక్కే వాహనాల్ని అలిపిరి వద్ద తనిఖీ చేస్తుండగా.. అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నిదానంగా కదలుతుండటంతో రద్దీ కనిపిస్తోంది. రెండో కనుమ రోడ్డులోనూ బండ్లు ఆగిపోవాల్సి వచ్చింది. శుక్రవారం 68,229 మంది దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటలు పడుతోంది.