తల్లి-కూతురు-మేనేజర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. బైక్ కు GPS పెట్టించిన ఐశ్వర్య(23).. భర్తను చంపేందుకు 5 సార్లు ప్రయత్నించింది. భర్తతో బైక్ పై వెళ్తుండగా వేటకొడవళ్లతో దాడి చేయాలన్నది ప్లాన్. కానీ 5 సార్లూ ప్లాన్ ఫెయిలైంది. ఆమెతో పెళ్లి కోసం తన భార్యను సైతం చంపాలనుకున్నా.. అలా చేయలేదు తిరుమలరావు. గద్వాల-ఎర్రవల్లి మధ్య హత్య చేయగా, APలోని నంద్యాల జిల్లా పాణ్యం వద్ద మృతదేహం దొరికింది. మోచేతిపై ‘అమ్మ’ అనే టాటూ ద్వారా అతడేనని గుర్తించారు. తమ్ముడు మిస్సయిన్నుంచీ మరదలి ప్రవర్తన చూస్తున్నాడు తేజేశ్వర్ పెద్దన్న తేజవర్ధన్. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవద్దని వారించినా ఆమె మాయలో పడ్డాడు. మరదలి కళ్లల్లో ఏ మాత్రం బాధ చూడని తేజవర్ధన్.. ఆమెనే ఏదో చేసిందంటూ కంప్లయింట్ ఇచ్చాడు.
ఫిబ్రవరి, జూన్ నెలల్లో తిరుమలరావు-ఐశ్వర్య మధ్య 2 వేల ఫోన్ కాల్స్ ఉన్నట్లు SP తెలిపారు. కొసమేరుపేంటంటే… అతడితో ఎంగేజ్మెంట్ ఇష్టం లేక ఈ ఫిబ్రవరిలోనే ఆమె ఇంటినుంచి పారిపోయింది. కానీ తేజేశ్వరే ఐశ్వర్యను ఒప్పించి రప్పించాడు. తన పెళ్లినాడు సైతం ఆమె.. తిరుమలరావుతో వీడియో కాల్ లో ఉంది. స్విఫ్ట్ కారు ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ ను వెనుక సీట్లోకి లాక్కుని హత్య చేశారు. రక్తం అంటిన బట్టల్ని కర్నూలు వద్ద నాలాలో పడేయగా, వీరందరికీ కొత్త బట్టల్ని తిరుమలరావు ఇచ్చాడు. ప్రియురాలితో లద్దాఖ్ లేదా అండమాన్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు. బ్యాంకులో రూ.20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. భర్త మిస్సయినా అతడి ఇంట్లోనే ఉంటూ నటిద్దామనుకున్నా.. తేజేశ్వర్ డెడ్ బాడీతో ఐశ్వర్య బండారం బయటపడింది.
1 thought on “ముక్కోణపు ప్రేమ కథ: భార్య చేతిలో భర్త బలి… Wife Killed Husband”